Monday, February 21, 2011

మహరాణి

జనరల్ గా నేను టీ.వి ఎక్కువ చూడను.నిన్న సాయంత్రం మావారు

చానెల్స్ మారుస్తుంటే జెమినిలో ప్రజావేదిక ప్రోగ్రాం వస్తోంది.అప్పటివరకూ

జరిగిన  చర్చ ఏమిటో నాకు తెలియదు కానీ కార్యక్రమం ముగిస్తూ

పరుచూరి గోపాలకృష్ణగారు చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి.

ఆయన చెప్పినది ఇది

"నలభై ఏళ్ళ మా కాపురంలో నేను ఏనాడూ జేబులోనుండి డబ్బులు తీసి 

మా ఆవిడకు ఇవ్వలేదు.ఇంట్లో బీరువాలో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి.

ఆవిడ తీసుకుని వాడుకుంటుంది.ఇప్పుడే కాదు నేను ఉద్యోగం చేసే

రోజుల్లో కూడా.

ఆర్ధిక అసమానత లేకపోతే  ఏఇల్లాలికీ అసంతృప్తి ఉండదు  

ఇల్లు ఆవిడ సామ్రాజ్యం,ఆ సామ్రాజ్యానికి ఆమె మహరాణి  "

ఎంత బాగా చెప్పారో అనిపించింది.

సమస్య అంతా మధ్యతరగతి మహిళలకే అని కూడా అన్నారు  బహుశా

జరిగిన చర్చ కూడా మధ్యతరగతి సంసారాల గురించే అనుకుంటా

తల్లిదండ్రులు ఇచ్చినది అంతా భర్తలకే ఇచ్చేసి ఆధారపడ్డ మొన్నటి తరం 

స్త్రీలు, ఆస్తి తమ పేరు మీదే ఉన్నావచ్చే ఆదాయం అంతా భర్తల చేతిలో

పెట్టి రూపాయికి వెతుక్కునే నిన్నటి తరం  మహిళలు, అందరూ

కాకపోయినా ఉద్యోగం చేస్తూ కూడా ఆధారపడి ఉండేవారు ఎక్కడో  ఒకచోట

ఉంటూనే ఉంటారు 

నిజంగానే ఇల్లాలిని మహరాణిని చేసి చూసుకునే భర్తలకి మాత్రం హాట్సాఫ్ .




.






 



Post a Comment

3 comments:

చెప్పాలంటే......

నిజంగానే ఇల్లాలిని మహరాణిని చేసి చూసుకునే భర్తలకి మాత్రం హాట్సాఫ్ .
నిజం :) baavundi mi tapaa....

లత

థాంక్యూ మంజూ

Unknown

ఇల్లాలిని మహరాణిని చేసి చూసుకునే భర్తలకి మాత్రం హాట్సాఫ్ .
నిజంగా నిజం :)

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008